సిద్ధార్థ్, షామిలి జంటగా ఆనంద్రంగ దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత, యూనివర్శల్ మీడియా అధినేత డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ "ఓయ్".
ఈ చిత్రం కోసం రెండు పాటలను ఆస్ట్రేలియాలో చిత్రీకరించారు. మే 25 నుంచి జూన్ 2వరకు ఆ పాటల చిత్రీకరణ రాజు సుందరం నృత్య సారథ్యంలో జరిగినట్లు దానయ్య పేర్కొన్నారు.
ఈ చిత్రానికి మరో పాట మిగిలి ఉందని, ఆ పాటను ఈ నెల 12 నుంచి చెన్నైలో చిత్రీకరించదలచినట్లు నిర్మాత అన్నారు. ప్రస్తుతం రీరికార్డింగ్ ముగింపు దశలో ఉందని, ఈ నెల 25న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల విడుదలైన ఈ సినిమా ఆడియో సూపర్ హిట్ అయిందని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు.