Asthma| Rajasekhar| Unani| Ayurveda| Fish medicine | ఉబ్బసం వ్యాధిని అరగంటలో నయం చేస్తా..!
|
దీనికోసం మూడేళ్ళుగా చేపమందును వాడటం విడ్డూరంగా ఉందని, తన దగ్గరకు వస్తే అరగంటలో నయం చేసి చూపిస్తానని రాజశేఖర్ అన్నారు. సోమవారం చేప మందు పంపిణీ చేస్తున్న ప్రాంతాన్ని రాజశేఖర్ సందర్శించి, చేపమందు వల్ల నయం పొందారా? లేదా? అనే వివరాలను అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బత్తిన సోదరులను రాజశేఖర్ ఏమాత్రం విమర్శించలేదు. కానీ పూర్వికులు ఏదో రహస్యాన్ని వారి వంశీయులకు చెప్పి ఉంటారని, ఆయుర్వేదం, యునాని తదితర వైద్యశాస్త్రంలో ఉబ్బసానికి తగిన పరిష్కారం ఉందని పేర్కొన్నారు. తాను కూడా పేదవారికి తగిన వైద్యసాయం చేయడానికి రంగం సిద్ధం చేశానని, త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తానని రాజశేఖర్ తెలిపారు.