గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » శర్వానంద్‌ "ప్రస్థానం" ప్రారంభం (Sarvanand| Rubi| Prasthanam| Sai Kumar| Deva katta)
కథనాలు
Feedback Print Bookmark and Share
 
WD
శర్వానంద్‌ హీరోగా 'ప్రస్థానం' అనే కొత్త చిత్రం బుధవారం ప్రారంభమైంది. హైదరాబాద్‌ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైన ఈ చిత్రంలో సాయికుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. వెన్నెల దర్శకుడు దేవకట్టా ఈ చిత్రానికి దర్శకుడు. రవి వల్లభనేని నిర్మాత.

శ్రీశ్రీ మహాప్రస్థానంలా.. తన ప్రస్థానం మానవీయ విలువలను, తరాలమధ్య విలువలు ఏ స్థాయిలో ఉన్నాయని చెబుతూ.. చక్కటి సందేశాన్ని ఈ చిత్రం ద్వారా ఇస్తున్నామని దర్శకుడు చెప్పారు.

35 ఏళ్ళుగా తాను పోషించని ఒక విభిన్నమైన పాత్రను ప్రస్థానంలో పోషిస్తున్నానని సాయికుమార్‌ చెప్పారు. ఢిల్లీకి చెందిన రూబీ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇంకా ఈ చిత్రానికి 'పూంఖ్‌' సినిమాకు కెమెరామెన్‌గా పనిచేసిన సవితా సింగ్‌ పనిచేస్తుంది. టెక్నికల్‌గా హైవాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని నిర్మాత చెప్పారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని దీపావళికి శర్వానంద్ ప్రస్థానం తెరపైకి వస్తుందని ఆయన తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: శర్వానంద్, ప్రస్థానం, రూబీ, సాయికుమార్, దేవకట్టా, వల్లభనేని, శ్రీశ్రీ మహాప్రస్థానం