ప్రతిష్టాత్మక ఎం.వి.ఎం. సంస్థ నిర్మించిన చిత్రం "ఎవరైనా ఎప్పుడైనా". ఇందులో వరుణ్సందేశ్, విమలారామన్ హీరోహీరోయిన్లుగా నటించారు. మార్తాండ్ శంకర్ దర్శకత్వం వహించిన, ఈ చిత్రం ఈనెల 26న విడుదలకానుంది.
ఈ సందర్భంగా రేడియోమిర్చిలో యువకులకు ఓ కాంటెస్ట్ పెట్టారు. బుధవారం ఆ వివరాలను రేడియోమిర్చి ద్వారా వెల్లడించారు. రేడియోమిర్చి 98.3 ఎఫ్.ఎంలో బుధ, గురువారాల్లో రెండురోజులపాటు గంటగంటకూ ప్రేమగురించి అడిగే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేవారికి మొబైల్ గెలుచుకునే అవకాశం ఉంటుందని దర్శకుడు శంకర్ తెలిపారు.
యువత మనోభావాలకు అనుగుణంగా ఈ చిత్రం రూపొందిందన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలనీ, ఇది కేవలం హైదరాబాద్ వాసులకే పరిమితమని రేడియోమిర్చి ప్రతినిధి స్వప్న తెలిపారు.