డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా వైష్ణో అకాడమీ నిర్మిస్తున్న "బంపర్ ఆఫర్" చిత్రం రెండు పాటలు మినహా పూర్తయింది.
పూరి జగన్నాథ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆయన శిష్యుడు జయరవీంద్ర దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ గాయకుడు కుంచె సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ చిత్రం గురించి ఎగ్జిక్యూటివ్ నిర్మాత శంకర్ మాట్లాడుతూ.. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 4వరకు బ్యాంకాక్లో 2 పాటల్ని చిత్రీకరించడంతో షూటింగ్ పూర్తవుతుందని చెప్పారు. సెప్టెంబర్ 5న పూరి స్థాపించిన ఆడియో సంస్థ పూరి సంగీత్ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదలవుతుంది.
సెప్టెంబర్లోనే ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని సన్నాహాలు చేస్తున్నామని శంకర్ అన్నారు. ప్రేక్షకులకు వందశాతం ఎంటర్టైన్మెంట్ అందించే రొమాంటిక్ మాస్ ఎంటర్టైనర్ ఇదని ఆయన తెలిపారు. హీరో సాయిరామ్ శంకర్ న్యూలుక్తో కనిపిస్తున్న ఈ చిత్రంలో ఆవకాయ్ బిర్యాని ఫేం బిందు మాధవి హీరోయిన్గా నటిస్తోంది.