P. Padmanabham|Swarna Kankanam| Allu Ramalingaiah| Allu Arjun| Ram Charan Teja | ప్రముఖ హాస్యనటుడు పి. పద్మనాభంకు స్వర్ణకంకణం
WD
గురువారం జూబ్లిహిల్స్లోని రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గుమ్మడి, కె. రాఘవేంద్రారావు, అల్లు అర్డున్ రామ్చరణ్తేజ, సారిపల్లి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
గుమ్మడి జ్ఞాపికతో సత్కరిస్తే, రాఘవేంద్రరావు, అల్లు అర్జున్, బ్రహ్మానందం ప్రశంసా పత్రంలో పద్మనాభంను గౌరవించారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. తన కెరీర్కు ముగ్గురు వ్యక్తులు కీలకమన్నారు. అందులో తాత ఒకరు. ఆయనపేరిట గల అవార్డు.. ఆయన సమకాలీనుకి దక్కడం గౌరవంగా భావిస్తున్నామన్నారు.
ఈ గౌరవ సత్కారాన్ని అందుకున్న పద్మనాభం మట్లాడుతూ.. మనిషి ఏడుస్తూ పుడతాడు. ఏడుస్తూ మరణిస్తాడు. ఈ మధ్యనుండే జీవితాన్ని మనిషి నవ్వు తూ బతకాలి. నటుడిగా ఆ నవ్వును నలుగురికి పంచే అవకాశం తనకు రావడం వరమన్నారు. ఈ సందర్భంగా "నావూరు మదరాసు.. నా పేరు రామదాసు.." అనే పాట పాడి సభికులను అలరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న "మగధీర" హీరో రామ్చరణ్ తేజ మాట్లాడుతూ.. తాతయ్య అందరి సినిమాలు చూశారు. నా సినిమా చూడకుండా వెళ్లిపోయాడు. ఇది తలచుకున్నప్పుడల్లా బాధేస్తుంది. ఈ అవార్డును పద్మనాభంకు అందజేయడం సముచితమన్నారు.
అల్లుఅరవింద్, అల్లు అర్జున్, గుమ్మడి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి చిరంజీవి అభిమానులు భారీగా తరలివచ్చారు. కానీ మెగస్టార్ అస్వస్థత కారణంగా రాకపోవడంతో వారు నిరాశకు గురైయ్యారు.