డా||. డి. రామానాయుడు మనుమడు రాణాను హీరోగా పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం "లీడర్". ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక ఏవీఎం సంస్థ నిర్మిస్తోంది. కాగా, ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ప్రొడక్షన్స్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది.
ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు హ్యాపీడేస్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెలిపారు. ఈ చిత్రం తర్వాత రాణా నటించబోయే సినిమా కూడా సిద్ధమైందని ఆయన అన్నారు.
ఇటీవలే "ఓయ్" చిత్రానికి దర్శకత్వం వహించిన ఆనంద్రంగ రెండో చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. లేటెస్ట్ టెక్నాలజీతో ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలిసింది.