Allu Aravind | Magadheera | Cinema | Flood | Collections | RamCharan | మానవత్వం ఉన్న మనుషుల్లారా.. "మగధీర" చూడండి!
File
FILEసర్వం కోల్పోయిన కట్టుబట్టలతో మిగిలిన బాధితులను ఆదుకునేందుకు గాను అరవింద్ ముందుకు వచ్చారు. తమ వంతు సాయం చేయాలని ఆయన తలచారు. ఇందుకోసం 'మగధీర' చిత్రానికి ఆదివారం (25వ తేదీ) వసూలయ్యే మొత్తం కలెక్షన్లను వరద బాధిత సహాయ నిధికి అందజేయాలని నిర్ణయించారు.
అందువల్ల ఆదివారం ఈ చిత్రాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఈ చిత్రం విడుదలైన 85 రోజుల్లో దాదాపు 75 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. చిత్రం విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు రికార్డులపై రికార్డులు నెలకొల్పుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా కాసుల వర్షం కురిపిస్తూ.. ఇప్పటికీ అన్ని సెంటర్లలో హౌస్ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో వరద బాధితులకు తన వంతు సాయం చేసే ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని ఆదివారం చూస్తే.. ఆ రోజు వసూలయ్యే కలెక్షన్స్ మొత్తాన్ని బాధితులకు అందజేస్తామని అల్లు అరవింద్ ప్రకటించారు.