జగపతిబాబు, నీలిమ, మాస్టర్ అతులిత్ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం మా నాన్న చిరంజీవి చిత్రాన్ని లాఫింగ్ లార్డ్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై వి.టి. గిరిధరరావు, మురళీ సంయుక్తంగా నిర్మించారు. అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన గిరిధరరావు మాట్లాడుతూ... 35 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. సినిమా చేయడం తెలుసు కానీ డిస్ట్రిబ్యూషన్ తెలియదు. నట్టికుమార్ సహకారంతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని తెలిపారు.
నట్టికుమార్ మాట్లాడుతూ... మొత్తంగా ఈ చిత్రాన్ని వాశాఖ టాకీస్పై విడుదల చేస్తాం. జగపతిబాబు చిత్రాలంటే మావిచిగురు వంటి వినోదాత్మక చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఇందులో కూడా ఆ సినిమాలో ఉన్నట్లు సెంటిమెంట్ సన్నివేశాలు ఉంటాయి. డిసెంబరు 25న 90 ప్రింట్లతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని అన్నారు.