1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. MAA Dairy

Hyderabad | MAA Dairy | Prasad labs | Akkineni Nageswara Rao | Murali Mohan | ప్రసాద్ ల్యాబ్స్‌లో "మా" డైరీ ఆవిష్కరణ

హైదరాబాద్
WD
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన డైరీ విడుదల కార్యక్రమం మంగళవారం ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు డైరీని ఆవిష్కరించి కృష్ణకు అందజేశారు. ఈ సందర్భంగా "మా" అధ్యక్షులు మురళీమోహన్ మాట్లాడుతూ... "మా అసోసియేషన్ స్థాపించిన నాటి నుంచి నటీనటులకు డైరీ ఉంటే బావుంటుందని, వారి ఫోన్ నెంబర్లు, డేట్స్‌తో పాటు పుట్టినరోజులు కూడా ఇవ్వడం జరిగింది.

డైరీని వెంట తీసుకుపోవడం కోసం పాకెట్ సైజులో వేస్తున్నాం. "మా" సేవా దృక్పథంతో ఇటీవల వరద బాధితులకోసం ఓ కార్యక్రమం నిర్వహించి 6 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. "మా" డైరీని గత ఏడాది సుజన్ గ్రూపు యాభైవేలకు స్పాన్సర్ చేశారు. ఈ ఏడాది కాపీలు పెరగడం వల్ల లక్షకు చేరింద"ని అన్నారు.

అక్కినేని మాట్లాడుతూ... "చాలా ఏళ్లుగా ఆర్టిస్టులకు సుళువుగా ఉండటంకోసం డైరీని ఇవ్వడం జరుగుతోంది. అయితే ఈ డైరీలో ఫోన్ నెంబర్ల వల్ల మాలాంటి వాళ్లకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. రాత్రి పదిగంటల తర్వాత టీవీల్లో మేము నటించిన సినిమాలను చూసి ఎగ్జైట్ అయి నిద్రపోయేవారిని లేపి ఆ సినిమాలో బాగా చేశారని చెప్తుంటారు.

అంతేకాక నాగార్జున, సుమంత్‌కు అమ్మాయిలు ఫోన్లు చేసి నాగచైతన్య, సుశాంత్‌ల ఫోన్ నెంబర్లను అడుగుతుంటారు. నటునిగా నేను చివరి వరకూ నటిస్తూనే ఉంటాను" అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కృష్ణ, విజయనిర్మల, గీతాంజలి, బాలయ్య, ఏవీఎస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఫైట్ మాస్టర్ రాజు మృతికి ఒక నిమిషం మౌనం పాటించారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT