దక్షిణాది సూపర్స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య వివాహం అంగరంగ వైభవంగా శుక్రవారం చెన్నైలోని రాణి మెయమ్మాయ్ హాలులో జరిగింది. ఈ వివాహ వేడుకకు రాజకీయ ప్రముఖులతోపాటు భారతీయ సినీ పరిశ్రమకు చెంది మేటి నటీనటులు హాజరయ్యారు.
కేంద్ర హోం మంత్రి చిదంబరంతోపాటు బాలీవుడ్ సినీ పరిశ్రమ నుంచి అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, శ్రీదేవి, బోనీ కపూర్, టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి.. ఇంకా ఇతర తారలు హాజరయ్యారు.
కాగా సౌందర్యకు ఈ ఏడాది ఫిబ్రవరిలో స్టాఫర్డ్ గ్రాడ్యుయేట్ అయిన అశ్విన్తో నిశ్చితార్థం జరిగిన సంగతి విదితమే.