పరిశ్రమకు చెందిన వారే బాధలు అర్థం చేసుకుంటారు: శ్రియ
|
ఈ నేపథ్యంలో.. 'శివాజి' షూటింగ్లో శ్రియ బిజీగా ఉన్న సమయంలో పారిశ్రామికవేత్త షూటింగ్ స్పాట్కు రాగా, ఆయన్ను సరిగా రిసీవ్ చేసుకోలేదని, అందువల్ల ఆయన కోపంతో అలిగి ఢిల్లీకి వెళ్లినట్టు కోడంబాక్క వర్గాలు వినికిడి. ఆ తర్వాత ఆయన వ్యాపారంలోను, శ్రియ నటనలో మునిగిపోవడంతో వారి మధ్య దూరం పెరుగుతూ వచ్చిందట.
ఇదే విషయమై శ్రియా మాట్లాడుతూ... ఇది కొద్ది రోజులు సాగిన వ్యవహారం మా భిన్న వృత్తులు మమ్మల్ని కలుసుకోకుండా చేస్తున్నాయి. సహజంగానే మేము దూరం అయ్యాం. ఇలాంటి స్థితిలో సంబంధాన్ని కొనసాగించడం కష్టమేననంటోంది. ఇంకా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలోనే ఒకరిని చూసుకుంటేనే ఈ వృత్తిలో ఉండే సాధక బాదకాలు తెలుస్తాయని శ్రియ వేదాంత ధోరణిలో మాట్లాడుతోంది.
