''ఓం శాంతి ఓం'' భామ దెబ్బకు యూవీ బౌల్డ్
Updated: Sat, 5 Jan 2008 (19:01 IST)
బాలీవుడ్ హాటెస్ట్ హీరోయిన్ దీపికా పదుకొనె చేసే ప్రతి పని సంచలనమే అవుతోంది. బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ నటించిన "ఓం శాంతి ఓం" చిత్రంలో తన నటనతో బాలీవుడ్ చిత్ర రంగాన్నే తనవైపుకు తిప్పుకున్న హీరోయిన్ పదుకొనె. అలాగే.. తాజాగా తన అందచందాలతో క్రికెట్ యువ హీరోలను తన వలలో వేసుకున్నట్టు వినికిడి. మొన్న 'జార్ఖండ్ డైనమెట్' ధోనీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈమె... నేడు 'సిక్సర్ల హీరో' యువరాజ్తో షికార్లు చేస్తున్నట్టు పుకార్లు వస్తున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న యూవీ ఆహ్వానం మేరకు.. పదుకొనె సిడ్నీకి వెళ్లడమే కాకుండా.. శుక్రవారం రాత్రి ఓ రెస్టారెంట్లో పార్టీకి వెళ్లినట్టు ఆస్ట్రేలియా పత్రికలు కథనాలను ప్రచురించాయి. దీనిపై యూవీ సన్నిహితుడు ఒకరు స్పందిస్తూ.. యూవీ-పదుకొనె మధ్య స్నేహం ఇప్పటిది కాదనీ, నాలుగు నెలల క్రితమే చిగురించిందని వారు అంటున్నారు. ఏదీ ఏమైనా.. టీమ్ ఇండియా వన్డే జట్టుకు కెప్టెన్-వైస్ కెప్టెన్గా రికార్డులు సృష్టిస్తున్న ధోనీ-యూవీల మధ్య పదుకొనె వ్యవహారం కాస్త చిక్కులు తెచ్చేలా వున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. ఎందుకంటే.. ధోనీతో ప్రేమాయణాన్ని కటీఫ్ చేసుకున్న పదుకొనె... యూవీతో జతకట్టడం ధోనీ మనస్సును గాయపరిచినట్టు భోగొట్టా.
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నారు.....
మరింత చదవండి