"మిస్సమ్మ", "సత్యభామ", "అనసూయ" ఇలా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తూ ముందుకు సాగుతున్న హీరోయిన్ భూమిక. తాజాగా ఆమె మరో మహిళా ప్రాధాన్యత వున్న చిత్రంలో నటించనుంది. "మల్లెపూలు" అనే టైటిల్ను పరిశీలిస్తున్న ఈచిత్రానికి వి.సముద్ర దర్శకత్వం వహించనున్నారు. 'అనసూయ' చిత్రం తర్వాత దర్శక, రచయిత శోభన్ భూమికతో ఓ చిత్రానికి సన్నాహాలు చేశాయి. ఆమెకు కథ వినిపిస్తుండగా శోభన్ హఠాన్మరణం చెందిన విషయం తెల్సిందే.
లోగడ సముద్ర దర్శకత్వంలో వచ్చిన 'ఎవడైతే నాకేంటి' చిత్రం ఘన విజయం సాధించగా, ఆ తర్వాత వచ్చిన 'విజయదశమి' పూర్తిగా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో సముద్ర మరో చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. తన తదుపరి చిత్ర ప్రధాన పాత్రలో భూమికను ఎంపిక చేసినట్టు ఫిల్మ్ వర్గాల సమాచారం. అలాగే ఈ చిత్రంలో మురళి అనే కుర్రాడు తొలి సారి హీరోగా పరిచయం కానున్నాడు. ప్రస్తుతం తారకరత్న హీరోగా 'వెంకటాద్రి' అనే చిత్రానికి సముద్ర దర్శకత్వం వహిస్తున్నారు.
|