ప్రపంచ మాజీ విశ్వ సుందరి ఐశ్వర్యారాయ్ సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకోనున్న నటీమణిగా గుర్తింపుపొందనున్నారు. ఇటీవల ఆమె హీరోయిన్గా నటించిన "జోధా అక్బర్" ప్రపంచ వ్యాప్తంగా కాసుల వర్షం కురిపిస్తున్న విషయం తెల్సిందే. ఇదిలావుండగా దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్, యువ సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం "రోబో"లో ఐశ్వర్యారాయ్ హీరోయిన్గా నటించనున్న విషయం తెల్సిందే.
ఇందుకోసం ఆమె ఏకంగా నాలుగు కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకోనుంది. ఇంత మొత్తంలో పారితోషికం అందుకునే అత్యంత ఖరీదైన నటిగా భారతీయ చిత్రసీమలో ఐష్ పేరు స్థిరస్థాయిగా నిలిచిపోనుంది. "గురు", "ధూమ్-2", "జోధా అక్బర్" చిత్రాల విజయాలతో ఐశ్వర్యకు మరింత ఇమేజ్ పెరిగిన విషయం తెల్సిందే. అభిషేక్ బచ్చన్ను వివాహమాడినప్పటికీ.. ఆమె తన అందచందాలను కాపాడుకుంటూ బాలీవుడ్ హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విషయం తెల్సిందే.
|