ప్రధాన పేజి > వినోదం > వెండితెర > గుసగుసలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
"ఓం శాంతి ఓం" ముద్దుగుమ్మ అలిగిన వేళ...
FileFILE
"బాలీవుడ్‌ బాద్‌షా" షారుక్ ఖాన్ సరసన నటించిన 'ఓం శాంతి ఓం'తో ముద్దుగుమ్మ దీపికా పడుకోనే రాత్రికి రాత్రే టాప్ హీరోయిన్ల రేసులోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గానే చెలామణి అవుతోంది. అయితే 'చాందిని చౌక్ టు చైనా' సినిమా నిర్మాతలు మాత్రం మరో రకంగా ఆలోచిస్తున్నారు. ఆ సినిమాలో అక్షయ్ కుమార్, దీపిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతుండగా హీరోహీరోయిన్లకు వేర్వేరు హోటళ్ళలో గదులను కేటాయించారు.

ముఖ్యంగా బ్యాంకాక్‌లోనే అత్యంత ఖరీదైన హోటల్‌ ఫోర్ సీజన్స్‌లో అక్షయ్‌కు బస ఏర్పాటు చేసిన నిర్మాతలు ఆ హోటల్‌లో సగం చార్జీ వసూలు చేసే గ్రాండ్ సుఖుంవిత్‌లో బస ఇచ్చారు. మిగతా యూనిట్ సభ్యులు కూడా అదే హోటల్‌లో ఉన్నప్పటికీ అక్షయ్ ఉన్న హోటల్‌లో తనకు రూమ్ ఏర్పాటు చేయక పోవడం దీపికకు మనస్థాపం కలిగించిందని బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. నిర్మాత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల దీపికా కాస్త మనస్థాపం చెందినట్టు సమాచారం.
మరిన్ని
అత్యంత ఖరీదైన నటిగా రికార్డు సృష్టించనున్న ఐష్
కరీనా.. సౌందర్య రహస్యం తెలుసా?
ఈ నెలలో మెగాస్టార్ కొత్త చిత్రం ప్రారంభం..!
పిలిస్తే వస్తానంటోన్న భువనేశ్వరి
ఇంటర్నెట్‌లో ఐశ్వర్య అశ్లీల ఫోటో..!?
టాలీవుడ్‌కు మలయాళ ముద్దుగుమ్మ గుడ్‌బై..!