ఐపీఎల్ టోర్నీలో ఆడుతున్న చెన్నై సూపర్కింగ్స్ జట్టు ప్రచార దూతగా నయనతార స్థానంలో త్రిషను నియమించడానికి నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారట.
అంతేనా నయనతారను తమ ప్రచార దూతగా తొలగిస్తున్నట్టు నిర్వాహకులు శుక్రవారం ప్రకటించేశారు కూడా. దీంతో పాపం నయనతార తనవెంట ఉంటూనే తనకు గుంతలు తవ్వుతున్నారంటూ తెగ బాధపడుతోందట.
అసలు విషయం ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రచారదూతగా ఉన్న నయనతార ఆ జట్టు ఆడిన తొలి మ్యాచ్కు హాజరుకాకపోవడంతో నిర్వాహకులకు చిరెత్తుకొచ్చి ఆమెను ప్రచారదూతగా తొలగించేశారట.
అంతేనా నయనతార స్థానంలో త్రిషను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా వారు సూచనప్రాయంగా ప్రకటించేశారట. దీంతో తెగ ఫీలైపోయిన మన నయనతార ఓ పత్రికా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనతో ఉండి తననే ముంచాలనుకునే వారే ఇలా చేస్తున్నారని వాపోయిందట.
ఇంతకీ నయనతార బాధపడుతోంది తనను తొలగించినందుకా... లేక త్రిషను నియమించినందుకా... ఎమో ఈ విషయం మాత్రం నయనతారకే తెలియాలి. ఎందుకంటే ఆడవారి మాటలకు అర్ధాలే వేరు కదా.
|