పదహారేళ్ళ వయస్సులోనే హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన పండంటి పడుచుపిల్ల హాన్సికా మొత్వానీ. 'కోయి మిల్గయా' అనే చిత్రంలో బాలీవుడ్ చిత్ర రంగ ప్రవేశం చేసిన ఈ ముద్దుగుమ్మకు తెలుగు వెండితెర ఆహ్వానం పలికింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన 'దేశముదురు' చిత్రంలో తెలుగు వెండితెరపై తళుక్కుమంది. మూడో చిత్రం 'ఆప్కా సురూర్' చిత్రం కూడా మంచి పేరే తెచ్చిపెట్టింది. ఈ భామ వ్యక్తిగత అభిప్రాయాలను తెలుసుకుందామా?