"పాండురంగడు" తర్వాత బాలకృష్ణ తదుపరి చిత్రం ఏమిటనేది...? ఫిలింనగర్లో చర్చనీయాంశమైంది. ఎం.ఎస్.రాజు చిత్రాన్ని నిర్మించాలనుకున్నారని వార్తలు వచ్చినా ఆయన వేరే సినిమాలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో ప్రభాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో "యోగి" చిత్రాన్ని నిర్మించిన కడప మేయర్ పి. రవీంద్రా రెడ్డి త్వరలో బాలకృష్ణతో సినిమా తీయనున్నట్లు సమాచారం.
ఈ చిత్రానికి పందెంకోడి. భీమ చిత్రాలకు దర్శకత్వం వహించిన లింగుస్వామి దర్శకత్వం వహించనున్నారు. హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్పైకి రానుందని తెలిసింది. మరీ... వై.ఎస్. బావమరిది అయిన నిర్మాత.. బాలయ్యతో చిత్రం ఎలా తీస్తారని అభిమానులకు సందేహం తలెత్తొచ్చు. అది.. అదే... ఇది.. ఇదే.. మరింత సమాచారం కోసం.. కొద్దిరోజులు వేచి చూడాల్సిందే...!
|