కల్లోలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకాశ్మీర్లో తెలుగు చిత్ర యూనిట్పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో వాహనాలు పగిలి పోయాయి. దర్శకరత్న దాసరి నారాయణరావు నిర్మాతగా సౌభాగ్య మీడియాపై కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కాశ్మీర్ లోయల్లో జరుపుకుంటోంది.
ఇందులోభాగంగా మంగళవారం మొత్త 33 మంది సభ్యులతో కూడిన చిత్ర యూనిట్ షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో చిత్ర యూనిట్పై దాడి జరిగింది. చిత్ర హీరో జగపతి బాబు, హీరోయిన్ మీరా జాస్మిన్లతో సహా చిత్ర యూనిట్ సభ్యులంతా సురక్షితంగా ఉన్నట్టు సౌభాగ్య మీడియాకు చెందిన రాము అనే వ్యక్తి తెలిపారు. ప్రమాద పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.