గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » మళ్ళీ కలుస్తున్న "రోజాపూలు" జంట!
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
WD
శ్రీరామ్ కెరీర్‌లో మెమోరబుల్‌గా నిలిచిపోయే చిత్రం "రోజాపూలు". అతని ఫస్ట్ హీరోయిన్ భూమిక. రోజాపూలు తర్వాత ఇద్దరూ కలిసి నటించలేకపోయారు. హిట్ ఫెయిర్ అయిన వీరిద్దరినీ కలిపే ప్రయత్నాలు తర్వాత ఎవ్వరూ చేయలేదు. ప్రస్తుతం వీరిద్దరిని జంటగా చేసేందుకు దర్శకుడు అరుణ్ ప్రసాద్ ప్రయత్నిస్తున్నారు.

ఈయన గతంలో "తమ్ముడు" సినిమాను రూపొందించారు. భాస్కర రెడ్డి నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వారిద్దరి కెమిస్ట్రీ బాగుంటుందని, ఆడియన్స్‌కు మళ్ళీ కొత్తదనం చూపిస్తారని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం భాస్కర్ రెడ్డి నాగబాబుతో "ఏక్‌పోలీస్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇకపోతే "భూమిక" మల్లెపూవు చిత్రంలో నటిస్తోంది. మరోవైపు "పోలీస్ పోలీస్"లో శ్రీరామ్ పోలీసుగా నటిస్తున్నారు. అంతా బిజీగా ఉన్నా ఆగస్టు నెలాఖరుకు డేట్స్ దొరకడంతో కొత్త సినిమా రూపొందనుందని తెలిసింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర కథనాలు శ్రీరామ్ కెరీర్‌ మెమోరబుల్‌ రోజాపూలు హీరోయిన్ భూమిక