గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » ఛార్మి "మనోరమ" ఫలించేనా?
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
WD
జీటీవీ సంస్థ నిర్మిస్తోన్న ద్వితీయ చిత్రం 'మనోరమ'. జీటీవీ సంస్థ తొలిచిత్రం "మస్త్" చిత్రం సీరియల్ కన్నా హీనంగా ఉందనే అపవాదును మూటకట్టుకుంది. శివాజీ, శివబాలాజీ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. మస్త్ చిత్రం విడుదలైన తొలి రోజే థియేటర్లలో జనాలు లేరు. కథలో పసలేదు.

చిన్న చిత్రాలు నిర్మించే నిర్మాతలే ఆచితూచి అడుగులేస్తుంటే, కోట్లు పెట్టే సంస్థ వాల్యూస్‌లేని కథతో ఎలా సినిమా తీసిందని ఇండస్ట్రీ అవాక్కయింది. ఆ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా నటుడు సురేష్ బాధ్యతలు చేపట్టారు. ఆయన సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించలేదని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇందులో విశేషమేమిటంటే..? రెండో చిత్రానికి కూడా సురేష్ బాధ్యతలు నిర్వహించారు. ఛార్మి ప్రధాన పాత్ర పోషించే "మనోరమ" సినిమా ఉగాది కానుకగా (27వ తేదీ) విడుదల కానుంది.

ఇటీవలే ఈ చిత్రాన్ని కొంతమంది ప్రముఖులకు ప్రదర్శించారు. ఈ చిత్ర కథ గోగుల్‌‌ఛాట్ బాంబు పేలుళ్ల కాన్సెప్ట్‌తో ఉందని తెలిసింది. మరోవైపు ఓ ప్రేమకథా నేపథ్యంలో కొనసాగుతుందని సినీ వర్గాల సమాచారం. ఇంతకీ మనోరమ అనే పేరు ఛార్మిది కాదట. ఓ హోటల్‌పేరని, అక్కడికి ఛార్మి వస్తుందని తెలిసింది.

అంతేకాదు.. టైటిల్‌కు ఛార్మీకి ఏమాత్రం సంబంధం లేదని చూసిన వారు చెబుతున్నారు. సినిమా పూర్తయ్యాక వారిని టీవీ ఛానల్స్ ముందుకు వచ్చి మొహమాటానికి ఆ సీన్ బాగుంది. ఈ సీన్ బాగుందని చెప్పారే మినహా, కథ బాగుందని, దర్శకుడు బాగా తీశాడని ఎవ్వరూ చెప్పలేకపోయారు. అంతా బయటకు వచ్చాక, మళ్ళీ జీటీవీ పప్పులో కాలేసిందని అనుకోవడం విశేషం. సో.. ఇంకా తెలియాలంటే.. ఈ నెల 27వ తేదీ వరకు ఆగాల్సిందే..!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర గుసగుసలు ఛార్మి మనోరమ జీటీవీ సంస్థ మస్త్ సీరియల్ సురేష్ శివబాలాజీ శివాజీ