వరుస ప్లాప్లతో విసిగి పోయిన టాలీవుడ్ ఛార్మింగ్ బ్యూటీ ఛార్మీకి కొత్త లైఫ్ ఇవ్వడానికి కృష్ణవంశీ సిద్ధమయ్యాడనే వార్తలు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
"అనుకోకుండా ఒకరోజు" చిత్రంతో హీరోయిన్ ఓరియేంటెడ్ చిత్రాల్లో బిజీ అయిన ఛార్మీ, "మంత్ర"తో ఆ తరహా చిత్రాలకు ఆమే దిక్కనే స్థాయికి ఎదిగింది.
అయితే 16డేస్ ప్లాప్ కావడంతో పాటు మాయగాడు ఇంకా రిలీజ్కాకపోవడం, కావ్యాస్డైరీ ఓ మోస్తరుగా ఆడడడం.. వంటి కారణాలు ఆమెకు నిరాశనే మిగిల్చాయి. రాఖీ తర్వాత పెద్ద హీరోల సరసన నటించే ఛాన్సులు కోల్పోయిన ఛార్మీ, ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఛార్మీ కష్టం చూస్తోన్న కృష్ణవంశీ తాను రవితేజతో చేస్తోన్న కొత్త చిత్రంలో ఈ బ్యూటీకి ఛాన్స్ ఇచ్చాడని టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఛార్మీకి రవితేజ కొత్త చిత్రంలో ఛాన్సు ఇవ్వడం పట్ల ఆ చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ సుముఖంగా లేదని తెలుస్తోంది.
'శ్రీఆంజనేయం' సినిమాలో కృష్ణవంశీ ఛార్మీని ఎక్పపోజింగ్కు బాగా ఉపయోగించుకున్నాడని, ఇదే తరహాలోనే ఈ సినిమాలోనూ వాడుకుంటాడని బెల్లంకొండ సురేష్ భావిస్తున్నట్లు సమాచారం. ఇంకేముంది..? ఈ సినిమా ఛాన్స్ ఛార్మీకి లభిస్తుందో? లేదో? వేచి చూడాల్సిందే.!