Keeravani | Allu Aravind | quarrel | Magadheera | కీరవాణి x అల్లు అరవింద్... అబ్బా ఇక్కడ కూడా గొడవేనా...?
WD
మొదటి నుంచి కీరవాణి ట్యూన్స్లో కొద్దిగా మార్పులు చేయాలంటూ... సున్నితంగా చెబుతూ... చివరికి డామినేట్ చేసేవాడట. దాంతో కీరవాణి ఆగ్రహించి.. కొన్నాళ్లు విదేశాలకు వెళ్లిపోయాడు. దీంతో సినిమా ఆగిపోతుందనే టాక్ కూడా వచ్చింది.
మగధీర ఆడియో హక్కులు తన రికార్డింగ్ కంపెనీ వేల్స్కు ఇవ్వమని కీరవాణి అడిగితే.. ససేమిరా అని.. ఆదిత్యవారికి కట్టబెట్టాడట అరవింద్. దీంతో వివాదం మరింత ముదిరింది. ఇకపై గీతా ఆర్ట్స్ చిత్రాలకు సంగీతం చేయనని కీరవాణి తేల్చి చెప్పినట్లు సమాచారం. అందుకే పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్, గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యమైందని అప్పట్లో చెప్పారు. కానీ అసలు కథ ఇదంటండీ. ఏదైనా చివర్లో గదా అసలు విషయం తెలిసేది.
