హెటెక్ కాలంలో ప్రతి యువతీ యువకులు పబ్లకు వెళ్లి ఎంజాయ్ చేయడం సర్వ సాధారణం. ఈ కోవలో సినీ నటులు ముందుంటారు. పబ్లకు వెళ్లి పీకలదాకా తాగి తైతక్కలాడటం వారి అలవాటు. ఇది చిత్ర పరిశ్రమలోని మగాళ్లతో పాటు.. ఆడవాళ్లకు సైతం కామన్గా మారింది. తెలుగు చిత్ర పరిశ్రమలో పరభాషా నటీనటులు రాజ్యమేలుతున్నారు. దీంతో పరభాషా సంస్కృతి బాగానే దిగుమతి అయింది. ఫలితంగా ప్రధాన నగరాల్లో వెలసిన పబ్లన్నీ హీరో, హీరోయిన్లతో కళకళలాడుతున్నాయి.
వీటికి వెళ్లేందుకు హీరోయిన్లు హీరోలతో పోటీ పడుతున్నారు. ఈ కోవలో కామ్నా జఠ్మలానీ, ముమైత్ ఖాన్, కావేరీ ఝాలు మొదలుకుని త్రిష వరకు తక్కువేం కాదు. సాయంత్రం వేళల్లో టైమ్ పాస్, సరదా కోసం పబ్లకు వెళ్లే వీరు పెగ్గుల మీద పెగ్గులు గుటుక్కున తాగేస్తున్నారు. అపుడెపుడే చెన్నయ్లోని ఈసీఆర్ రోడ్డులో ఉన్న ఒక పబ్లో బీర్లు కొట్టిన త్రిష చెన్నయ్ వీధుల్లో చిందులేసిన విషయం తెల్సిందే.
అలాగే, మరో పార్టీలో పీకలదాకా మద్యం సేవించి క్రికెటర్ హేమాంగ్ బదానీతో కయ్యానికి కాలు దువ్వింది. తాజాగా గోపీచంద్ నటించిన "శంఖం" చిత్రం షూటింగ్ విదేశాల్లో జరుపుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన త్రిష.. షూటింగ్ ముగిసిన వెంటనే మందు బాటిల్స్ను చేత పట్టుకుని యమ స్పీడ్తో లాగించేదట. దీన్ని చూసిన చిత్రం యూనిట్ ముక్కున వేలు వేసుకున్నారట. ఎంతైనా.. హీరోయిన్ కదా.