మన దేశంలోని ఆసుపత్రులకు వెళ్లాలంటేనే కథానాయికలు భయపడుతున్నారు. ఒక సమస్యతో ఆసుపత్రికి వెళితే... పత్రికలు మరో సమస్య అని లేనిపోని పుకార్లు సృష్టించి బెంబేలెత్తిస్తున్నాయని వారు వాపోతున్నారు. అందుకే ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తినపుడు నేరుగా విదేశాలకు వెళ్లి సమస్యకు చికిత్స తీసుకుని వస్తున్నామని చెపుతున్నారు.
ఇటీవల బాలీవుడ్ సెక్సీ డాళ్ నిరవధికంగా ఓ నెలరోజులపాటు షూటింగ్లో పాల్గొన్న కారణంగా కాస్త సుస్తీ చేస్తే ఇటలీ వెళ్లిందట. ఆమె ఏ సమస్యతో ఇటలీ వెళ్లిందో కానీ వచ్చేటపుడు చూస్తూ ఆమె పెదవులు ఎర్రగా... వాచిపోయి కనిపించాయట. అంతే ఇక పత్రికలవారు తమ పెన్నులకు పని చెప్పారట. పెదవులు వాచిపోవడానికి కారణం ఏమిటన్న అంశంపై ఎవరికి తోచిన వార్తలు వారు రాసి పారేశారట.
పత్రికల రాతలు చూసి కంగానా కంగుతిన్నదట. పత్రికలవాళ్లందరినీ పనిగట్టుకుని పిలిపించి... ఎలర్జీ వల్ల తన పెదవులు వాచిపోయాయని పెదవులను కదపకుండా సమాధానం చెప్పిందట. పాపం మాట్లాడలేనంతగా పెదవులకు ఎలర్జీ సోకిందన్నమాట. ఇంతకీ ఆ ఎలర్జీ ఎలా సోకిందబ్బా...? అని మళ్లీ ఓ జర్నలిస్టు ప్రశ్నిచేసరికి... కంగనా పళ్లు పట పట నూరిందట. అంతే, ఆ పత్రికా సమావేశం స్టాప్.