ప్రధాన పేజివినోదం » వెండితెర » గుసగుసలు » మహేష్బాబు అలా చేయడానికి ఓ రీజనుంది!! (Maheshbabu | Hyderabad | Namrata | Tollywood Cinema)
మహేష్బాబు అలా చేయడానికి ఓ రీజనుంది!!
శనివారం, 23 జూన్ 2012( 12:30 IST )
WD
WD
హీరో మహేస్బాబు రెండో బిడ్డకు తండ్రికాబోతున్నాడనీ, అందుకే "సిరిమల్లెవాకిట్లో..." సినిమా షూటింగ్ కూడా రాజమండ్రిలో కాకుండా హైదరాబాద్లోనే సెట్వేసి తీస్తున్నారనే విషయం... వెబ్దునియా ప్రేక్షకులకు తెలిసిందే. ఇంతకీ విషయం ఏమంటే.. మహేష్బాబు, నమ్రత దంపతులు ఓ నిర్ణయానికి వచ్చారు. బిడ్డకు సంబంధించిన మూలకణాలను దాచుకోవాలనుకోవడం. ఇది వైద్యపరిభాషలో చాలా మంచి నిర్ణయం... బిడ్డపుట్టగానే బొడ్డు రక్తం నుంచి మూలకణాలు సేకరించి (స్టెంసెల్స్)ను భద్రపరుస్తారు.
ఇది పురాణాల్లోనూ ఉంది. ఆ కణాల సేకరణ వల్ల వ్యక్తి రోగాలనుబారి నుంచి కూడా కాపాడుకుంటారు. కాలక్రమేణా రాజులపాలన, బ్రిటీష్వారి పాలనల్లో ఆ గ్రంథాలు మరుగనపడ్డాయి. ఇటీవలే బౌద్ధభిక్షు కథతో వచ్చిన 'సెవెన్త్సెన్స్'లో కూడా హీరో సూర్యపై చేసి చూపించారు. ఆ మూలకణాలతో చురుకుదనం, తెలివితేటలు వంటివి వంశపారంపర్యంగా వచ్చేలా చేసే పెద్ద ప్రాజెక్ట్ అది. కానీ ఆ సినిమా అంతగా జనాలకు ఎక్కలేదు. అది వేరే విషయం.
ఇంతకీ మహేష్బాబు, నమ్రతలు మూలకణాలను భద్రపరిచే ప్రక్రియకు ముందడగు వేయడానికి ఓ రీజన్ ఉంది. వారికి కలిగిన మొదటి సంతానం మగపిల్లవాడు. కానీ పుట్టకలోనే ఏదో చిన్నపాటిలోపం వల్ల కొంతకాలం అనారోగ్యానికి గురయ్యాడు. దాన్ని సాల్వ్చేయడానికి దేశందాటి కూడా వెళ్ళారు.
ఆఖరికి తేలింది ఏమంటే.. అవన్నీ మన దేశంలోనూ మన రాష్ట్రంలోనే ఉన్నాయని... ప్రస్తుతం అతని కుమారుడు మంచి ఆరోగ్యవంతుడుగా ఉన్నాడు. అందుకే ముందుగా కళ్లుతెరిచి... వైద్యభాషను బాగా అర్థంచేసుకుని రెండో బిడ్డకు ఈ నిర్ణయం తీసుకున్నారని సన్నిహితులు తెలియజేస్తున్నారు. ఏదిఏమైనా...ప్రజల్లో అవేర్నెస్ చేయడానికి మహేష్బాబు ముందగుడువేసినట్లేకదా.