కాలేజీ సినిమా అనగానే స్టూడెంట్స్ లెక్చరర్స్ను ఏడిపించడం, ద్వంద్వార్థాలతో డైలాగ్లు, బఫూన్లగా చూపించడం, యువతల మిడ్డీలు, గౌన్లు వేసుకుని కాలేజీలకు రావడం అనేది.. గత నుంచి వస్తున్న ఆనవాయితీ. రియల్లైఫ్లో జరగని విషయాలను కాలేజీలో చూపిస్తూ తల్లిదండ్రులకు కాలేజీ పంపించాలంటే భయపడే రోజులు ఒకప్పుడు.
ప్రస్తుతం సినిమాల తీరు మారింది. దీనికి ఎవరో ఒకరో నడుం కట్టాలి. అందుకే కాలేజీ అంటే దేవాలయం, అసభ్యతలేకుండా మన కుటుంబంతో చూసేట్లుగా సినిమాలు తీయాలని మొదటి నుంచి మనస్సులో ఉన్న కోరికను నేను బయటపెట్టానని గర్వంగా చెబుతున్నాడు... శేఖర్ కమ్ముల.
"డాలర్ డ్రీమ్స్" అనే చిత్రాన్ని తీసినప్పుడు ఈయనెవరో తెలియదు. అది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంతో అతను మన తెలుగువాడే అని ఇండస్ట్రీ గుర్తించింది. అందుకే తెలుగు ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సృష్టించాలని "ఆనంద్" తీసినా విడుదల తర్వాత కాస్త భయమేసింది. అప్పుడు "శంకర్దాదా ఎం.బి.బి.ఎస్"కు పోటీగా అంతా కొత్తవారితో రిలీజ్ చేశాడు. రిలీజ్ తర్వాత వచ్చిన స్పందన చూసి ఇండస్ట్రీ ఆయన ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది.
ఆ తర్వాత 'గోదావరి" అంటూ అలనాటి ఎన్. ఎన్. ఆర్ నటించిన "అందాలరాముడు"ను మార్చి తీసి సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం తన సొంతగా అంతా కొత్తవారితో "హ్యాపీడేస్" అనే చిత్రాన్ని తీసి చిరంజీవి కొడుకు "చిరుత" పోటీగా రిలీజ్ చేశాడు. మళ్ళీ సక్సెస్ సాధించాడు. కాకపోతే సినిమాను అమ్మేశాడు. అయినా తన పని అయిపోయిందనుకోకుండా థియేటర్ రిపోర్ట్స్ను పర్యవేక్షిస్తునే ఉన్నాడు. ఈ సందర్భంగా బుధవారంనాడు క్రాస్రోడ్డ్లోని దేవీ థియేటర్లోకి వచ్చిన శేఖర్ కమ్ములతో జరిపిన మాటామంతీ....
|