''ఒంటరి''గా రానున్న గోపీచంద్
ఈతరం ఫిలిమ్స్ సంస్థ తాజాగా 'ఒక్కడున్నాడు' హీరో గోపీచంద్తో మరో చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రానికి "ఒంటరి" అనే టైటిల్ను ఖరారు చేసింది. 'నవభారతం' నుంచి, నిన్నటి 'రణం' చిత్రం వరకు పలు విజయాలు అందించిన సంస్థగా పేరున్న ఈతరం ఫిలిమ్స్ తన 14వ చిత్రంగా 'ఒంటరి'ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి 'గౌరి' ఫేమ్ బీవీ.రమణ దర్శకత్వం వహించనున్నారు.
దీనిపై ఈతరం సంస్థ అధినేత పోకూరీ బాబూరావు మాట్లాడుతూ.. గోపీచంద్ హీరోగా తమ సంస్థ నుంచి వస్తున్న 'ఒంటరి' చిత్రం తప్పకుండా మరో విజయవంతమైన చిత్రంగా నిలుస్తుందన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా భావనను ఎంపిక చేసినట్టు చెప్పారు.
తమిళంలో 'చిత్తిరం పేసుదడి', 'వెయిల్', 'దీపావళి' చిత్రాల్లో హీరోయిన్గా నటించి ఈ భామకు తెలుగులో ఇదే తొలి చిత్రమన్నారు. జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న 'ఒంటరి'కి ఇతర సాంకేతికవర్గం, నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని పోకూరి బాబూరావు తెలిపారు.
దీనిపై ఈతరం సంస్థ అధినేత పోకూరీ బాబూరావు మాట్లాడుతూ.. గోపీచంద్ హీరోగా తమ సంస్థ నుంచి వస్తున్న 'ఒంటరి' చిత్రం తప్పకుండా మరో విజయవంతమైన చిత్రంగా నిలుస్తుందన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా భావనను ఎంపిక చేసినట్టు చెప్పారు.
తమిళంలో 'చిత్తిరం పేసుదడి', 'వెయిల్', 'దీపావళి' చిత్రాల్లో హీరోయిన్గా నటించి ఈ భామకు తెలుగులో ఇదే తొలి చిత్రమన్నారు. జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న 'ఒంటరి'కి ఇతర సాంకేతికవర్గం, నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని పోకూరి బాబూరావు తెలిపారు.
