డబ్బున్న ప్రతి ఒక్కరూ చదువులేని పదిమందికి తమవంతు సాయం చేయాలనే సందేశంతో "రుద్రమణి'' చిత్రం రూపొందుతోంది. అబ్బాస్, తనూరాయ్ హీరోహీరోయిన్లుగా రాజీవ్కనకాల విలన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈదర రంగారావు నిర్మిస్తున్నారు.
WD
ఖలీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రీరికార్డింగ్ పూర్తిచేసుకుని డీటీఎస్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడూతూ ''సమాజానికి ఉపయోగపడే అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సందేశానికి వినోదం మేళవించి అశ్లీలతకు తావులేకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాం. విభిన్న కోణాలుగల పాత్రను అబ్బాస్ పోషించాడు. డూప్లేకుండా ఫైట్స్ కూడా చేయడంతో అబ్బాస్ గాయపడ్డాడు. అందుకే కొద్దిరోజులపాటు షూటింగ్ ఆలస్యమయింది. ఈ చిత్రంలో వేటూరి రాసిన శివతాండవం హైలైట్గా నిలుస్తుంది''. అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న తాను క్వాలిటీపరంగా మంచి చిత్రం తీయాలనే ఈ రంగంలో ప్రవేశించాను. జూలైలో ఈ చిత్రాన్ని విడుదలచేయనున్నామని తెలిపారు. ఇందులో ఆరుపాటలున్నాయనీ, ఆడియోకు మంచి స్పందనలభించిందని సంగీత దర్శకుడు ఆర్.బి.శౌరి తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటి రూపాకౌర్, అనంత్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
కెమెరా : కిషన్సాగర్ ఎడిటింగ్ : కె.రవీంద్రబాబు మాటలు : మోహన్ పాటలు : వేటూరి వెన్నెలకంటి, ఖలీల్, జయరాజ్ కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం : ఖలీల్