ఫస్ట్ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ చిత్రంలో కమిలినీ
|
సెప్టెంబరు 10 వరకూ నరేష్, శర్వానంద్ , కమిలినీ ముఖర్జీలపై సీతారామశాస్త్రి రాసిన మూడు పాటలను చిత్రీకరించనున్నారు. వారితోపాటు అభిషేక్, బ్రహ్మానందం కూడా పాల్గొన్న కొన్ని ముఖ్య సన్నివేశాలను కూడా తీయనున్నారు. ఈ విషయాలను నిర్మాత జాగర్లమూడి సాయిబాబు చెబుతూ, జానకి కోసం ఇద్దరు అబ్బాయిలు సాగించే జీవన ప్రయాణం ఈ చిత్ర ఇతివృత్తమని పేర్కొన్నారు.
అక్టోబరు రెండో వారంలో విడుదలయ్యే ఈ చిత్రంలో శ్వేతా అగర్వాల్, ఎల్బీ శ్రీరాం, గిరిబాబు, ఎమ్మెస్ నారాయణ, విజయ్చందర్, రవిప్రకాష్, హేమ, సరస్వతమ్మ ఇతర ముఖ్య తారాగణం
