దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్న ''జయం'' జంట
|
ఈ చిత్రానికి 'అమ్మ' రాజశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా, చక్రీ సంగీతం సమకూర్చారు. దీనిపై నిర్మాత శివరామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. నితిన్-సదా జంట అనగానే 'జయం' సినిమా గుర్తుకువస్తుందని, ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం 'టక్కరి' అన్నారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందన్నారు. మిగిలిన పాత్రల్లో చంద్రమోహన్, సాయాజీ షిండే, ఆలీ, రఘుబాబు, సత్యం రాజేష్, సుధ, గీతాసింగ్, వేణు, బేబి త్రిష తదితరులు నటించారు.
