జల్సా మొబైల్ గేమ్స్ విడుదల
|
ఎఫ్. ఎక్స్ ల్యాబ్స్ ఈ యానిమేషన్ గేమ్ను రూపొందించింది. అల్లు అర్జున్, అల్లు శిరీష్లతో పాటు 11 మంది సభ్యులుగా ఏర్పడి ఈ యానిమేషన్ గేమ్ను రూపొందించారు. సినిమా వ్యాపారంలో ఇటువంటి ప్రయోగం సక్సెస్ అయితే భవిష్యత్ మరిన్ని చిత్రాలు ఈ తరహాలో చేయాలనుకుంటున్నామని తెలిపారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ, త్వరలోఆన్లైన్ గేమ్ను కూడా ప్రవేశపెట్టనున్నామనీ, మొబైల్ గేమ్ను 50 రూపాయలకే అందజేస్తున్నామనీ, దీనికి కోట్ ఉంటుందనీ, బ్లూటూత్తో మరొకరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి వీలులేదని తెలిపారు.
అర్జున్ మాట్లాడుతూ, నాకు మొదటి నుంచి యానిమేషన్ అంటే ఇష్టం. అనుకోకుండా హీరో అయ్యాను. పదేళ్లనాడు మన సినిమాలకు దీన్ని అప్లయ్ చేయాలనుకున్నాను. అది ఈనాటికి నెరవేరింది. యానిమేషన్ రంగం ఆంధ్రప్రదేశ్లో వ్యాప్తిచెందుతోంది. భవిష్యత్ యానిమేషన్దే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఫ్.ఎక్స్ ల్యాబ్స్ ప్రతినిధి శశిరెడ్డి, జాక్సన్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు పాల్గొన్నారు.
