జూన్ ఆరు నుంచి అధ్యక్షా..! అందరికీ వందనాలు
|
ఈ చిత్రం విశేషాల గురించి నిర్మాత వలవలి జగన్నాథరెడ్డి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని జూన్ ఆరున ప్రేక్షకుల ముందుకు తేనున్నామని తెలిపారు. సమాజంలో జరుగుతున్న సమస్యలను సృశిస్తూ మరుధూరి రాజా ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారని ఆయన తెలిపారు. ఈ చిత్రంలో ప్రేక్షకులకు నచ్చే అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
ఈ చిత్రంలోని ఇతర ముఖ్యపాత్రల్లో ఉత్తేజ్, బ్రహ్మానందం, వేణుమాథవ్, ధర్మవరపు సుబ్రమణ్యం, నర్రా, విజయరంగరాజు తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి కెమెరా- శంకర్ కంతేటి, సంగీతం- సాయికార్తీక్, పాటలు- రవిరాజ్, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం- మరుధూరి రాజా.
