''మిషన్ ఇస్తాంబుల్''లో అందాల శ్రేయ
|
పాప్కార్న్ మోషన్ పిక్చర్స్, బాలాజీ టెలీఫిల్మ్స్ బ్యానర్లో రూపొందుతోన్న 'మిషన్ ఇస్తాంబుల్' చిత్రంలో శ్రేయ నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఏక్తా కపూర్, శోభా కపూర్, సునీల్ షెట్టీ, షబ్బిర్ బోక్స్వాలా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్ర దర్శకుడు అపూర్వ లాఖియా మాట్లాడుతూ, జర్నలిస్టు నేపధ్యంలో కథ సాగుతుందన్నారు.
వివేక్ ఒబెరాయ్, జాయెద్ ఖాన్, సునీల్ షెట్టీలతోపాటు దక్షిణాది తార శ్రేయ నటన ఆకట్టుకుంటుందన్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై 25న విడుదల చేయటానికి చిత్ర దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. బెస్ట్ ఆఫ్ లక్ శ్రేయా...
