1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

జూన్ 26న ''కొంచెం కొత్తగా'' రానున్న వెంకట్

జూన్ 26 కొంచెం కొత్తగా వెంకట్
WD PhotoWD
వెంకట్, తులీప్‌జోషి జంటగా రాజు రాజేంద్ర దర్శకునిగా రూపొందుతోన్న చిత్రం 'కొంచెం కొత్తగా'. సపారా ఆర్ట్స్ పిక్చర్స్ పతాకంపై సతీశ్‌పాల్ రాజ్, అబ్రహామ్ కలవకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

ఈ చిత్రం విశేషాల గురించి నిర్మాత మాట్లాడుతూ ఈ చిత్రంలో సగం మాటలే ఉండవు. సగం తర్వాత పాటలూ ఉండవు అని తెలిపారు. అందుకే ఈ చిత్రానికి కొంచెం కొత్తగా అనే టైటిల్ పెట్టామని పేర్కొన్నారు. సస్పెన్స్, మర్డర్, కామెడీతో ఈ చిత్రం తెరకెక్కుతోందని ఆయన తెలిపారు.

తక్కువ పాత్రలతో రూపొందిన ఈ చిత్రానికి ఎక్కువ ట్రీట్‌మెంట్ ఇవ్వడం జరిగిందన్నారు. హీరో వెంకట్ మాట్లాడుతూ చాలా గ్యాప్ తర్వాత తెలుగు చిత్రం చేస్తునన్నారు. ఈ చిత్రంలో మొదటి అర్ధబాగం హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ సాంకేతికంగా విలువలు ఉన్న చిత్రమిదని అన్నారు.

థ్రిల్లర్‌ చిత్రాలను రాత్రిపూట భయపెట్టేలా తీస్తారని అయితే ఈ చిత్రం పగలు కూడా భయపెట్టేలా రూపొందించామన్నారు. ఈ చిత్రానికి కెమెరా- ఎస్. అరుణ్‌కుమార్, సంగీతం- రాజు రావ్, కథ- కె. ఆనంద్.
About Writer
Munibabu