శివ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై దువ్వాసి మోహన్, భువనేశ్వరి కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'కుర్కురే'. ఈ చిత్రాన్ని ఈనెల 11వ తేదీన విడుదల చేయనున్నట్టు నిర్మాత డి.మోహన్ తెలిపారు. జునైద్ దర్శకత్వంలో ఆద్యంతం వినోదభరితంగా తెరకెక్కిన ఈ చిత్రం తమ బేనర్కు విజయవంతమైన చిత్రంగా ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
దర్శకుడు జునైద్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో సీనియర్ నటి భువనేశ్వరి పోషించిన పాత్ర చిత్రానికి హైలెట్గా నిలుస్తుందన్నారు. ఇంద్ర అనే నటుడుని విలన్గా తొలిసారి పరిచయం చేస్తున్నట్టు చెప్పారు.
పలు చిత్రాల్లో హీరోలకు సన్నిహితుడిగా నటించిన దువ్వాసి మోహన్ ఈ చిత్రంలో తొలిసారి కథానాయకుడి పాత్రను పోషిస్తున్నట్టు చెప్పారు. కుర్కురే తింటూ హాయిగా వినోదాన్ని ఆస్వాదించేట్లుగా చిత్రం ఉంటుందన్నారు. ఈ చిత్రాన్ని జులై 11వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు.
|