ప్రధాన పేజి > వినోదం > వెండితెర > రాబోయే చిత్రాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
18న ప్రేక్షకుల ముందుకు "కృషి"  Search similar articles
కృషి
WD PhotoWD
యశ్వంత్, సుహాని జంటగా శ్రీ వెంకట సత్యసాయి ఫిలింస్ పతాకంపై రూపొందుతోన్న "కృషి" చిత్రం ఈ నెల 18వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత పేకేటి సుబ్రమల్లేశ్వరరావు వెల్లడించారు. శివాజీ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... ఎంతటి విజయం వెనుకైనా నేనున్నానని సగర్వంగా చెప్పుకునేది కృషేనని, మరి ఇద్దరు మనసులు కలిసి మురిసే ప్రేమాయణంలోనూ కృషి ఉంటోందని అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ... ఇప్పటికే విడుదలైన పాటలు శ్రోతల మెప్పును పొందాయని, చిత్రం కూడా మరింత ఆదరణ పొందుతుందని ఆకాంక్షించారు. చిత్రం గురించి చెప్పాలంటే, కృషి అనే పదం వింటేనే ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటుందని, త్రికరణశుద్ధిగా కృషి చేయాలనే పాయింట్‌తో తెరకెక్కించామని అన్నారు. ఇప్పటికే తొలికాపీ సిద్ధమైందని, సోమవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు తెలిపారు.

కథానాయకుడు యశ్వంత్ మాట్లాడుతూ... రాజ్‌కిరణ్ ఇచ్చిన బాణీలు బాగున్నాయని, రైటర్ మోహన్ సంభాషణలు పొందిగ్గా ఉన్నాయని, నా కెరీర్‌కు ఈ చిత్రం తోడ్పడగలదని ఆశిస్తున్నానన్నారు. ఇంకా ఈ చిత్రానికి కెమెరా... ఎస్‌.వి. శివరామ్, ఆర్ట్... ఎస్‌.వి. మౌళి. ఎడిటర్.. వి. నాగిరెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం... శివాజీ ప్రసాద్.
మరిన్ని
రామ్, హాన్సికల మస్కా
ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు "యువత"
11న విడుదల కానున్న 'కుర్‌కురే'
జూలై రెండో వారంలో "మా ఆయన చంటి పిల్లాడు"
జూలై 11న వస్తున్న "బ్రహ్మానందం డ్రామాకంపెనీ"
మలేషియా వెళ్లనున్న "ప్రేమోత్సవం"