ప్రధాన పేజి > వినోదం > వెండితెర > రాబోయే చిత్రాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రీ-రికార్డింగ్‌లో "గుండె ఝల్లుమంది"  Search similar articles
WD
ఉదయ్‌కిరణ్, అదితిశర్మ నాయికా నాయకలుగా నటిస్తోన్న చిత్రం గుండె ఝల్లుమంది". పరుచూరి శివరామ్ ప్రసాద్ నిర్మాత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి మదన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓ పాట మినహా చిత్రం షూటింగ్ పూర్తయింది. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాల్లో భాగంగా రీరికార్డింగ్ జరుగుతోంది.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... తన మనసుకి నచ్చే మనసు తారసపడ్డప్పుడే స్పందన మొదలవుతుందని, అప్పుడు కురిసే ప్రేమ జల్లులో తడిసి ముద్దవ్వాల్సిందేనని అంటున్నారు. ఈ విషయాన్నే వినోదాత్మకంగా తెరకెక్కించామని వెల్లడించారు. నిర్మాత మాట్లాడుతూ... యువతీ, యువకుల హృదయ స్పందనలకీ, సవ్వళ్లకు దర్పణం ఈ చిత్రమన్నారు.

ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ...ఇందులో కాలేజీ స్టూడెంట్‌గా నటిస్తున్నానని, కథతో పాటు, తన పాత్ర ప్రేక్షకుల మెప్పును పొందుతోందన్నారు. ఇంకా ఈ చిత్రంలో అజయ్, ఆహుతి ప్రసాద్, వేణుమాధవ్, ధర్మవరపు, సురేఖావాణి, మధుమణి తదితరులు నటిస్తున్నారు. కెమెరా... ప్రభాకర్ రెడ్డి, పాటలు.. శివశక్తి దత్తా, చైతన్య ప్రసాద్, సమర్పణ.. పరుచూరి కిరీటి.
మరిన్ని
18న ప్రేక్షకుల ముందుకు "కృషి"
రామ్, హాన్సికల మస్కా
ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు "యువత"
11న విడుదల కానున్న 'కుర్‌కురే'
జూలై రెండో వారంలో "మా ఆయన చంటి పిల్లాడు"
జూలై 11న వస్తున్న "బ్రహ్మానందం డ్రామాకంపెనీ"