మాధవన్, భావన, ప్రకాష్ రాజ్ ప్రధాన తారాగణంగా రూపొందించిన "ఆర్య ఎం.బి.బి.ఎస్" అనే తమిళ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. తేజ సినిమా పతాకంపై సి. కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి బాలశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పాటల ప్రదర్శన బుధవారం నాడు ఫిలింఛాంబర్లో జరిగింది.
ఈ సందర్భంగా చిత్రం గురించి సి. కళ్యాణ్ మాట్లాడుతూ... తమిళంలో ఈ చిత్రం సూపర్హిట్ అయిందని, అందుకే తెలుగులో రీమేక్ చేయాలనుకున్నామని, కానీ భారీ వ్యయంతో తీయాల్సి రావడంతో డబ్బింగ్ చేస్తున్నామని అన్నారు. ఢీ, రెడీ తరహాలో మైండ్గేమ్తో ఈ చిత్రం రూపొందుతోందని, "ఒక్కడు"కు మించిన పాత్రను ప్రకాష్ రాజ్ ఇందులో పోషించాడని తెలిపారు.
కాలేజీలో హీరోకు, విలన్కూ మధ్యసాగే గేమే ఈ చిత్రమని, అది ఏమిటనేది చిత్రంలో చూడాల్సిందేనని అన్నారు మణిశర్మ బాణీలు, మోహన చంద్ర సాహిత్యం ఆకట్టుకుందని, తొలికాపీ సిద్ధమైన ఈ చిత్రాన్ని ఈ నెల 25వ తేదీన విడుదల చేస్తున్నామని తెలిపారు. ఇంకా ఈ చిత్రానికి కెమెరా... భూపతి, ఎడిటింగ్... త్రినాథ్, సహనిర్మాతలు...పత్సానాగరాజు, సి.వి.రావ్.
|