వేణు, మేఘానాయర్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న "దీపావళి" చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. హరిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం దీపావళి. ఎ.ఎ.ఎ. క్రియేషన్స్ పతాకంపై తీగల కృపాకర్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత సారథ్యం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వేణు వైవిధ్యం కనిపిస్తాడని సినిమా బాగా వచ్చిందని. ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తుందనే నమ్మకముందని నిర్మాత కృపాకర్ రెడ్డి చెప్పారు.
మేఘానాయర్ హీరోయిన్గా పరిచయమవుతున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోందని ఆయన చెప్పారు. ఆగస్టు నెల మధ్యలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కృపాకర్ రెడ్డి వెల్లడించారు. వినోదాత్మకంగా, ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న "దీపావళి" సినిమాలో వినోద్ కుమార్, సుబ్బరాజు, సత్య ప్రకాష్, బ్రహ్మాజీ, అలీ, బ్రహ్మానందం, కొండవలస, చలపతి రావు, సుధ, హేమ తదితరులు నటిస్తున్నారు.
|