30న వస్తున్న "బ్యాంక్"
|
అబ్బాస్, రాహుల్దేవ్, జాకీష్రాఫ్, అర్చన ప్రధాన పాత్రధారులుగా బి. అరుణ్ కుమార్ దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం "బ్యాంక్". ఈ సినిమా ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్వాహకుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ శనివారం వెల్లడించారు.
బ్యాంక్ దోపిడీ నేపథ్యంలో రూపొందిన చిత్రమిదని, హాలీవుడ్ తరహాలో ఈ సినిమా ఉంటుందని గౌడ్ తెలిపారు. ముంబై, చెన్నైలలో షూటింగ్ జరిపామని, దొంగతనంగా సంపాదించిన డబ్బు దక్కదనే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా చెబుతున్నామని రామకృష్ణ గౌడ్ అన్నారు. ఇందులో ఐదు పాటలున్నాయని, "బొబ్బిలిపులి"లోని "ఓ సుబ్బారావు..." అనే పాటను రీమిక్స్ చేశామని వివరించారు. ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకముందని చెప్పారు.
పూజా భారతి, రఘువరన్, జీవా, నర్సింగ్ యాదవ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా.. కె. జగదీష్, ఎడిటింగ్... రామ్గోపాల్ రెడ్డి, సంగీతం.. చిన్ని చరణ్, కథ, మాటలు, నిర్మాత, స్క్రీన్ప్లే, దర్శకత్వం... బి. అరుణ్ కుమార్.
