ఏప్రిల్లో తెరపైకి వస్తోన్న "రాజు మహారాజు"
శర్వానంద్, మోహన్బాబు, రమ్యకృష్ణ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం "రాజు మహారాజు". కుమారస్వామి క్రియేషన్స్ పతాకంపై పసుపులేటి కుమారస్వామి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భాను దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను అన్నపూర్ణ స్టూడియోలో శర్వానంద్తో ఓ పాటను పలువురు డాన్సర్లపై కొరియోగ్రాఫర్ నోబుల్ నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ఫ్యామిలీ, యూత్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆరు పాటలున్నాయన్నారు. ఆస్ట్రేలియాలో ఓ పాటను చిత్రించాల్సి ఉంటుందని, మార్చిలో ఆడియోను, ఏప్రిల్లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.
హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. "గమ్యం" తర్వాత ఏడాది గ్యాప్లో మంచి కథ విన్నానని, ఈ చిత్రం ద్వారా డాన్స్కూడా బాగా చేయగలనని నిరూపించుకుంటానని అన్నారు. మోహన్బాబుతో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. రమ్యకృష్ణ తన డ్రీమ్గర్ల్. ఆమెతో కలిసి నటించడం థ్రిల్గా ఉందని శర్వానంద్ అన్నారు. ఇందులో.. రిచ్పర్సన్గా నటిస్తున్నానని, ఓ కుటుంబాన్ని కాపాడే చిత్ర కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ఫ్యామిలీ, యూత్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆరు పాటలున్నాయన్నారు. ఆస్ట్రేలియాలో ఓ పాటను చిత్రించాల్సి ఉంటుందని, మార్చిలో ఆడియోను, ఏప్రిల్లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.
హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. "గమ్యం" తర్వాత ఏడాది గ్యాప్లో మంచి కథ విన్నానని, ఈ చిత్రం ద్వారా డాన్స్కూడా బాగా చేయగలనని నిరూపించుకుంటానని అన్నారు. మోహన్బాబుతో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. రమ్యకృష్ణ తన డ్రీమ్గర్ల్. ఆమెతో కలిసి నటించడం థ్రిల్గా ఉందని శర్వానంద్ అన్నారు. ఇందులో.. రిచ్పర్సన్గా నటిస్తున్నానని, ఓ కుటుంబాన్ని కాపాడే చిత్ర కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని ఆయన తెలిపారు.
