డాక్టర్. రాజశేఖర్, భూమిక హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "నా స్టైలే వేరు". ఈ సినిమా శుక్రవారం సెన్సార్ను పూర్తి చేసుకుందని చిత్ర నిర్మాత మాగంటి గోపీనాథ్ తెలిపారు.
సెన్సార్ "యు" సర్టిఫికేట్ ఇచ్చిందని, ఈ నెల 12వ తేదీన సినిమాను విడుదల చేస్తామని నిర్మాత అన్నారు.
చిత్ర దర్శకుడు జి. రాంప్రసాద్ మాట్లాడుతూ.. రాజశేఖర్ బాడీ లాంగ్వేజ్కు సరిపడా కథతో ఈ సినిమా తెరకెక్కనుందని చెప్పారు.
కుటుంబనేపథ్యంలో సాగే చక్కని ఎంటర్టైనర్ ఇదని, ఇంతవరకు ఆవేశపూరితమైన పాత్రల్లో చూసిన రాజశేఖర్ను ఈ చిత్రంలో కొన్నిచోట్ల శాంతమూర్తిగా చూస్తారని దర్శకుడు వెల్లడించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఆడియోకు మంచి స్పందన లభించిందన్నారు.