యూత్ హీరో సుమంత్ కథానాయకుడిగా కృతికరబంద కథానాయికగా నటిస్తోన్న చిత్రం "బోణీ". గ్రీన్ మ్యాంగోస్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి రాజా దర్శకునిగా పరిచయమవుతున్నారు.
ఈ సినిమాను సంగీత దర్శకుడు రమణ గోగుల నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న బోణీ చిత్రాన్ని ఈ నెల 12వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.
మాఫియా బ్యాక్డ్రాప్లో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ సినిమాలో సుమంత్ అద్భుతంగా నటించాడని ఆయన తెలిపారు. ఇందులో సీరియస్ క్యారెక్టర్ను పోషించిన సుమంత్కు ధీటుగా కృతి చక్కగా నటించిందని దర్శకుడు చెప్పారు. తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.