హ్యాపీడేస్, కొత్తబంగారులోకం సినిమాల ద్వారా హిట్ కొట్టిన వరుణ్ సందేశ్ "ఎవరైనా ఎప్పుడైనా" ద్వారా మరో హిట్ కొట్టేందుకు సై అంటున్నాడు.
మార్తాండ్ శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు. ప్రతిష్టాత్మక ఏవీఎం పతాకంపై రూపుదిద్దుకుంటోన్న ఈ టాలీవుడ్ మూవీపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
ఐదేళ్ల గ్యాప్ అనంతరం ఏవీఎం బ్యానర్పై విడుదల కానున్న లవ్లీ ఎంటర్టైనర్ "ఎవరైనా ఎప్పుడైనా" సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు వెల్లడించారు.