వాయిదా పడుతూ వస్తున్న నాగచైతన్య జోష్ చిత్రం ఎట్టకేలకు ఈ నెల 5వ తేదీ.. అంటే శనివారం నాడు విడుదల చేయనున్నామని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్తో తమకిది హ్యాట్రిక్ చిత్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఓవర్సీస్ ప్రింట్లు వెళ్లిపోయాయనీ, ఈ నెల 3వ తేదీన రాష్ట్రంలో ఏర్పడిన అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని చిత్రాన్ని వాయిదా వేశామన్నారు.