డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా, "ఆవకాయ్ బిర్యానీ" ఫేమ్ బింధు మాధవి హీరోయిన్గా నటిస్తోన్న "బంపర్ ఆఫర్" చిత్రం షూటింగ్ పూర్తయ్యింది.
వైష్ణో అకాడమీ పతాకంపై పూరిజగన్నాథ్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జయరవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. యూత్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దే ఈ చిత్రానికి గాయకుడు రఘు కుంచె సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఈ చిత్రం ఆడియో "పూరి సంగీత్" ద్వారా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత శంకర్ గణేష్ మాట్లాడుతూ.. బ్యాంకాక్లో రెండు పాటలను చిత్రీకరించామన్నారు.
దీంతో ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందని.. విజయదశమి కానుకగా ఈ నెల 25న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని శంకర్ గణేష్ చెప్పారు.
ఇంకా ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, ఆర్ట్: చిన్నా, కథ, మాటలు, నిర్మాత: పూరి జగన్నాథ్.