అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న "బంపర్ ఆఫర్"
WD
డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా పూరి శిష్యుడు జయరవీంద్ర దర్శకత్వంలో వైష్ణో అకాడమీ పతాకంపై నిర్మిస్తున్న "బంపర్ ఆఫర్" సినిమా నిర్మాణం పూర్తయ్యింది. ఈ చిత్రం ద్వారా పూరి మిత్రుడు, గాయకుడు రఘు కుంచెని సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
"పూరీ సంగీత్" పేరుతో పూరి జగన్నాథ్ ఆడియో సంస్థను ప్రారంభించి తొలి చిత్రంగా 'బంపర్ ఆఫర్' ఆడియోను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శంకర్ గణేష్ మాట్లాడుతూ.. మా బంపర్ ఆఫర్ ఆడియో సూపర్హిట్ అయ్యిందన్నారు. అన్ని ఏరియాలనుండి రిపీట్ ఆర్డర్స్ రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. అక్టోబర్9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని 'బంపర్ ఆఫర్' అలరించి బంపర్ హిట్ అవుతుందని ఆశించారు.
హీరో సాయిరామ్ శంకర్ న్యూలుక్తో కనిపిస్తోన్న ఈ చిత్రంలో "ఆవకాయ్ బిర్యాని" ఫేమ్ బిందు మాధవి హీరోయిన్గా నటిస్తోంది.