డ్రీమ్గర్ల్, అలనాటి సినీతార శ్రీదేవి నటించిన 'పదహారేళ్ల వయసు' సినిమా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అదే పేరుతో భూషణ్, ఆర్యా ఓరా హీరోహీరోయిన్లుగా కొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ మరియు సెన్సార్ సిగ్నల్ కోసం వేచి వున్న ఈ సినిమాను ఈ నెల 13వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత హరి ప్రసాద్ తెలిపారు.
షూటింగ్ను పూర్తిచేసుకున్న ఈ సినిమాకు శ్రీ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. 16 ఏళ్ల అమ్మాయిలో కలిగే ఆలోచనలకు అద్దం పట్టే రీతిలో ఈ సినిమా ఉంటుందని నిర్మాత హరి ప్రసాద్ అన్నారు. ఎం.ఎస్. నారాయణ, కృష్ణభగవాన్, వేణుమాధవ్, ఎల్.బి. శ్రీరామ్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: రాజ్ కిరణ్.